నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ హీరోకి సరైన హిట్టలేదు. ఆయన నుంచి చివరిగా వచ్చిన మూడు చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో వంటి సినిమా లు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడూ పోయాయో కూడా తెలీదు. అలా హిట్ కొట్టాలని ఉద్దేశ్యం తో నితిన్ ఇప్పుడు చేస్తున్న ఈ మాచర్ల నియోజకవర్గం సినిమా పైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు.

రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది. నితిన్ సొంత బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ఆగస్టు 12వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయట వైరల్ గా మారింది. ఈ సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టి చేశారట.

కొన్ని సీన్స్ రీ షూట్ జరగడం వల్లనే 30 శాతం ఎక్కువ ఖర్చయింది అని అంటున్నారు. సొంత బ్యానర్ లో సినిమాలు చేసే హీరోలు తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఈ హీరో భిన్నంగా ఆలోచించి సినిమా బాగా రావాలని ఉద్దేశంతో బెటర్మెంట్ కోసం కొన్ని సీన్లను రీ షూట్ చేయించాడట. దాంతో అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువైంది. దీంతో నితిన్ గతంలోలా కాకుండా పర్ఫెక్షన్ కోసం బడ్జెట్ విషయంలో ఈ రిస్క్ చేయడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. సినిమా రిజల్టులో పొరపాటు వస్తే ఇబ్బంది కలుగుతుంది కానీ హిట్ అయితే మాత్రం తప్పకుండా నితిన్ కు మంచి పేరు వస్తుందని అంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎంటటైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతం సమకూరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: