టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . 

మూవీ లో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటించగా , గీత గోవిందం ఫెమ్ పరశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , తనికెళ్ల భరణి , వెన్నెల కిషోర్ ,  నదియా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు . 

మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . విడుదల అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. 

ఇలా సర్కారు వారి పాట సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భం గా ఈ చిత్ర బృందం తాజాగా ఈ మూవీ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. సర్కారు వారి పాట మూవీ 50 రోజులకు సంబంధించి చిత్ర బృందం విడుదల చేసిన  పోస్టర్ లు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: