తాజాగా  సాయి పల్లవిపై వీరాభిమానంతో ఓ అభిమాని తన గుండెలపై సాయి పల్లవి బొమ్మను టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక  ఆ అభిమానిని స్వయంగా కలిసి, సాయి పల్లవి థాంక్స్ చెప్పింది.ఇప్పుడు తాజాగా  ఇలాంటి అభిమానమే ఓ లేడీ అభిమాని ప్రదర్శించింది.. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కోసం. విజయ్ దేవరకొండ బొమ్మను తన వీపు భాగంలో వేయించుకుంది ఈ లేడీ వీరాభిమాని.కాగా ఆమె పేరు చెర్రీ.ఈమె  ఆషా మాషీ అమ్మాయి కాదు. ఆమె ఓ డాక్టర్. అయితే ఈమె డాక్టర్ చెర్రీ అన్నమాట.ఇకపోతే ఈమెకి విజయ్ దేవరకొండ అంటే పిచ్చ అభిమానమట. 

ఇక అందుకే ఆయన బొమ్మను తన వీపుపై టాటూగా వేయించేసుకుంది.అయితే  తాజాగా ఈ లేడీ వీరాభిమానిని విజయ్ దేవరకొండ మీట్ అయ్యాడు లైగర్ టీమ్‌తో కలిసి.అంతేకాదు తన అభిమాన హీరోకి తాను వేయించుకున్న టాటూను చూపిస్తూ, తెగ సిగ్గుపడిపోయింది డాక్టర్ చెర్రీ. ఇక అంతటి అభిమానానికి విజయ్ దేవరకొండ కూడా షాకయ్యాడు.అంతేకాక  నోట మాట రాక, ఆమెను అలా చూస్తూ వుండిపోయాడు.ఇకపోతే తన వీరాభిమానిని 'లైగర్' టీమ్‌కి ప్రత్యేకంగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే  వీరాభిమానం సరే, ఇదంతా 'లైగర్' సినిమా ప్రమోషన్లకు బాగా వుపకరిస్తోందనే చెప్పాలి.'లైగర్' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని చార్మి పూరీ జగన్నాధ్ లతో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారట మేకర్స్.ఇక ఈ సినిమా విడుదల కాకముందే పూరి జగన్నాథ్ మరో సినిమాని మొదలు పెట్టేసాడు రౌడీ హీరో. లైగర్ తర్వాత వీరి కాంబినేషన్లో జనగణమన అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసింది. ఇటీవల ఈ చిత్రాన్ని ఎంతో లాంచనంగా ప్రారంభించగా.. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: