టాలీవుడ్ సీనియర్ హీరో లలో ఒకరు అయిన రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ అద్భుతం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఈ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ' ఓ టి టి' లో  విడుదల అయ్యింది .

ఆ తర్వాత శివాని రాజశేఖర్  ' డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ' మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా  సోనీ లీవ్ ' ఓ టి టి ' లో విడుదల అయ్యింది  . ఇలా సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శివాని రాజశేఖర్ తాజాగా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలియ జేసిన విషయం మనకు తెలిసిందే . కాక పోతే తాజా గా శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో నుంచి తప్పుకున్నట్లు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది . అలాగే శివాని రాజశేఖర్ తను మిస్ ఇండియా పోటీల్లో నుంచి తప్పుకోవడానికి గల కారణాలను కూడా తెలియ జేసింది. శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీలకు తమిళ నాడు కేటగిరి నుండి ఎంపిక అయ్యింది . 

శివాని రాజశేఖర్ ప్రస్తుతం వైద్య విద్యను  అభ్యసిస్తుంది . ముందు ప్ర‌క‌టించిన తేదీ కంటే ముందు గానే శివాని రాజశేఖర్ లు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయ‌ట‌ . మిస్ ఇండియా  ఫైన‌ల్ పోటీ గ్రాండ్ ఫినాలే జ‌రిగే రోజైన జులై 3 తేదీన కూడా త‌న‌కు ప‌రీక్ష ఉంద‌ని , అందు వల్లనే తాను మిస్ ఇండియా పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు శివాని రాజశేఖర్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియ జేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: