ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.  వాటితో పాటుగా మరికొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా ఆయన ఒప్పుకునే దిశగా ఆలోచిస్తున్నాడు. ఆయన సినిమాలు చేసే విధానం బాగానే ఉంది గాని వాటిని హిట్ మలుచుకోవడంలో విఫలం అవుతున్నాడని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కు హిట్ పడలేదు. సరైన సక్సెస్ చూసి చాలా రోజులు అయిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాల తో ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచాడు.

భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలే అయినా కూడా ప్రేక్షకులను ఆనందపరిచే అంశాలు లేకపోవడంతో ఆ సినిమాలను అభిమానులు సైతం రిజెక్ట్ చేశారు. అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రభాస్ ప్లాన్  వేస్తున్నాడు. ఆది పురుష్ సినిమా ఆయన తదుపరి సినిమాగా ప్రేక్షకులకు రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయను న్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశ పోస్టు ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉంది. 

దాని కంటే ముందు సలార్ చిత్రంని విడుదల చేయాలని భావించగా ఆ చిత్రం యొక్క షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది ఆ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నానని భావించి ఇప్పుడు ఆది పురుష్ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.  బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా పేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ప్రభాస్ అభిమానులు ఆకలి మీదున్న హిట్ ఈ చిత్రంతో వరిస్తుందా అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత కూడా ఆయన భారీ దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్నాడు.  మారుతి దర్శకత్వంలో ఓ చిన్న బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లను ఒకే చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: