అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

స్కిన్ షో కు , గ్లామర్ పాత్రలకు , కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ అందులో నటిస్తూ ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న సాయి పల్లవి తాజాగా విరాట పర్వం సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటించగా ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ జూన్ 17 వ తేదీన థియేటర్లలో విడుదలైన విరాట పర్వం సినిమా థియేటర్ లలో డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  థియేటర్ లలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విరాట పర్వం సినిమా సినిమా జులై   1 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా విరాట పర్వం సినిమా 'ఓ టి టి' స్ట్రీమింగ్ పై సాయి పల్లవి స్పందిస్తూ... విరాట పర్వం మూవీ లో తాను చేసిన వెన్నెల పాత్ర నేను ఇప్పుడు వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని క్యారెక్టర్ అని , ఆ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని తెలిపిన సాయి పల్లవి , విరాట పర్వం మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది అని అందరూ చూడాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: