సీనియర్ నటుడు నరేష్ సహా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ వ్యవహారం అంతా కూడా ఇండస్ట్రీలో గోల గోలగా మారింది. ఇక బెంగుళూరులో ఉంటున్న నరేష్ భార్య రమ్య రఘపతి .. భర్త నరేష్‌పై చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి.భర్త నరేష్ టేబుల్‌పై గన్ పెట్టి బెదిరించారని రమ్య తెలిపారు. ఆమె కామెంట్స్‌కి నరేష్‌ ఇంకా పవిత్రా కూడా స్పందించారు. ఇక మమ్మల్ని సపోర్ట్ చేయమని పవిత్రా కోరగా, నరేష్ తన మూడో భార్య మోసగత్తె అని కూడా పవిత్ర తెలిపింది.నటుడు నరేష్ ఇంకా పవిత్ర లోకేష్ మీద దాడి చేయడానికి నేడు రమ్య రఘుపతి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే రమ్య రఘుపతిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని హోటల్ నుంచి బయటికి పంపించారు. ఈ క్రమంలోనే ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. ఇక మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వివరాలు కూడా వెల్లడించారు. వారిద్దరు కూడా కలిసి ఉన్నారనే విషయం రాత్రి తెలిసిందని బెంగళూరు నుంచి రాత్రి సమయంలోనే ఇక్కడికి వచ్చినా కానీ రాత్రి సమయంలో వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా ఎదురు చూశానని అన్నారు.


ఇక ఆయనని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వారు ఎలా అల్లరి చేశారో మీరే చూశారని ఆమె చెప్పుకొచ్చారు. మీ ఇంట్లో ఆడపిల్లకు కూడా ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటారా అంటూ ఆమె మీడియా ప్రతినిధులను ప్రశ్నించింది.ఇక రమ్య మాట్లాడుతూ వారిద్దరూ స్నేహితులని చెప్పుకుంటున్నారని స్నేహితులైతే ఇలాగే ఒక గదిలో ఉంటారా అంటూ ప్రశ్నించారు. నన్ను చూడగానే గిల్టీగా ఫీల్ అయ్యాడని అందుకే అలా ఈలలు వేస్తూ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆమె పేర్కొన్నారు. ఇక బయటి వాళ్ళని అనేముందు మన ఇంటి బంగారమే సరిగా లేదని అందుకే నా జీవితం ఇలా తయారైందని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నరేష్ భార్యగా నరేష్ ఎలాంటి వారు అనే విషయం మీద తనకు పూర్తి అవగాహన ఉందని సుమారు 10 ఏళ్లుగా కాపురం చేశానని అందుకే ఈ విషయాలు మీద తనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ఇక పవిత్ర డబ్బుల కోసమే ఇలా చేస్తుందని, నా మొగుడు నాకు ఎలాగైనా కావాలని రమ్య అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: