ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ముందుగా
కొరటాల శివ దర్శకత్వంలోని
సినిమా మొదలు కాబోతుండగా ఆ తర్వాత
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ
తమిళ దర్శకుడు తో
సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెట్రీ మారన్
ఎన్టీఆర్ తో కలిసి ఓ
సినిమా చేయబోతున్నాడట.
దీనిపై అధికారిక ప్రకటన కూడా తొందర్లోనే రాబోతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో
ఎన్టీఆర్ ఇలా అగ్ర దర్శకులతో వరుసగా మూడు సినిమాలను ఓకే చేసుకొని తన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తున్నాడు. అయితే
ఎన్టీఆర్ తో
సినిమా చేయాలని అప్పట్లో మరొక
తమిళ్ దర్శకుడు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఆయనే హరి. సూర్యతో కలిసి ఆయన చేసిన
పోలీస్ యాక్షన్ భరితమైన సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. పోలీసు నేపథ్యంలోని సినిమాలను ఎంతో బాగా చేసి హీరోలకు సూపర్ హిట్ అందించే ఈ దర్శకుడు
ఎన్టీఆర్ తో చేయబోయే
సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూశారు.
కానీ
ఎన్టీఆర్ డేట్లు కుదరకపోవడంతో ఆయన ఇప్పుడు ఇంకొక హీరోతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాతో విజయాన్ని అందుకున్న
గోపీచంద్ తో కలిసి ఈ దర్శకుడు తన సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. హిట్ లు లేక ఇబ్బంది పడుతూన్న గోపీచంద్ కు ఇది మంచి
సినిమా అనే చెప్పాలి. ఇక లక్ష్యం ఫామ్
శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు గోపీచంద్. తొందర్లోనే ఈ
సినిమా పూర్తి కానుంది. ఆ తరువాత
హరి సినిమాను చేస్తాడు కావచ్చు గోపీచంద్. మరి ఆ తరువాత వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా అనేది చూడాలి. అభిమానులు అయితే వీరి
సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.