మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం
త్రివిక్రమ్ దర్శకత్వంలో
సినిమా రూపొందుతుంది. ఆ తరువాత
రాజమౌళి దర్శకత్వంలో ఓ
సినిమా చేయబోతున్నాడు. వచ్చే నెలలో
త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను మొదలు పెట్టడానికి మహేష్ ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఈ
సినిమా యొక్క ఫైనల్ నేరేషన్ వినడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ వెకేషన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన మహేష్ ను
త్రివిక్రమ్ అండ్ కో కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చి ఆ తర్వాత సినిమాలను మొదలుపెట్టబోతున్నాడు.
సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు తన తదుపరి సినిమాలను ఇద్దరు పెద్ద దర్శకులతో చేయడం ఆయన అభిమానులను ఎంతో ఆనందపరుస్తుంది. ఈ నేపథ్యంలో
రాజమౌళి సినిమా తర్వాత కూడా ఆయన చేయబోయే
సినిమా యొక్క దర్శకుడుని వెతుక్కుంటున్నట్లుగా ఇప్పుడు ఆయన చేస్తున్న కొన్ని పనులను బట్టి తెలుస్తుంది. ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న
విక్రమ్ సినిమా దర్శకుడు
లోకేష్ ను ఆయన పొగడడం దీనికి సంకేతంగా నిలుస్తుంది.
విక్రమ్ సినిమాతో దర్శకుడిగా మరొక స్థాయికి ఎదిగాడు లోకేష్. అంతకు ముందు ఆయన చేసిన
సినిమా లు హిట్ అవగా ఇది అందరికీ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. దేశవ్యాప్తంగా అందరు హీరోల అటెన్షన్ గ్రాబ్ చేసుకున్న ఈ దర్శకుడు తో కలిసి
సినిమా చేయాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. అందులో ఒకరు మహేష్. తాజాగా ఆయన ఈ సినిమాను వీక్షించి దర్శకుడుని పొగుడుతూ తన సోషల్
మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. దీన్నిబట్టి ఆయనతో
సినిమా చేయాలని కోరుకునే హీరోల జాబితాలో ఆయన కూడా చేరారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.
లోకేష్ కి పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి ఇకపై.