ఈటీవీ బుల్లితెర షో అయిన జబర్దస్త్ కార్యక్రమం కి ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అయితే గత పది సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ కార్యక్రమం నుంచి టాప్ కమెడియన్స్, జడ్జెస్ వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం కూడా ఆదరణ కోల్పోతుంది.ఇక ఇప్పటికే నాగబాబు, రోజా, హైపర్ ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శీను వంటి వారు వెళ్ళిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇదిలావుంటే కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోబోతున్నాను అని పరోక్షంగా వెల్లడించారు.

ఇకపోతే  అనసూయ వెళ్లడంతో మరొక యాంకర్ ను ఈ కార్యక్రమానికి తీసుకు వస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది.ఇక జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇదిలావుంటే  జబర్దస్త్ కార్యక్రమానికి మధ్యలో అనసూయ తన వ్యక్తిగత కారణాలవల్ల కాస్త విరామం ప్రకటించారు.అయితే ఆ సమయంలో రశ్మినే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కార్యక్రమాలకు ఏకచిత్రాధిపత్యం వహించింది రష్మీ . ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతుందని తెలియగానే తిరిగి రష్మీ ఈ రెండు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తారని,

 మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ ఏకచిత్రాధిపత్యం వహించబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సుడిగాలి సుదీర్ఘ వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుంది.తాజాగా ఇప్పుడు అనసూయ కూడా వెళ్లిపోవడంతో అనసూయ స్థానంలో రష్మీ నే యాంకర్ గా వ్యవహరిస్తారనీ తెలుస్తుంది. అయితే మొత్తానికి అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమ రేటింగ్స్ పూర్తిగా పడిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: