తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఉన్న హీరోలలో ఎక్కువగా మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోలే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సాయి ధరమ్ తేజ్. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ హీరో ఇప్పుడు కొన్ని సినిమాలకోసం సిద్ధం ఆవుతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత చాల రోజులకు కెమెరా ముందుకు రాబోతున్న ఈ హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తుడడం విశేషం. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పై ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నాడో ఏమో తెలీదు కానీ 'భవధీయుడు భగత్ సింగ్' ని సైతం పీకే పక్కనబెట్టడం జరిగింది. ఆ సినిమా స్థానంలోనే ఈ సినిమా ను చేస్తున్నాడట పవన్.

వాస్తవానికి ఈ సినిమా ను ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉంది. కానీ భీంలా నాయక్ సినిమా కోసం ఈ చిత్రాన్ని జరుపుతూ రాగా ఇప్పుడు మేనళ్లుడుకోసం చేస్తున్న సినిమా కోసం మళ్ళీ ఈ సినిమా ను పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. సడెన్ గా పవన్  ఈ సినిమాకి డేట్లు కేటాయించడంతో చాలా ప్రత్యేకమైన సినిమాగా మీడియాలో హైలైట్ అయింది. త్రివిక్రమ్సినిమా కి రచయితగా వ్యవహరించబోతున్నాడు. అంతేకాదు నటుడు సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతకు ముందు ఈ సినిమా తమిళనాడులో వినోదీయ సితం అనే పేరుతో విడుదల కాగా ఇప్పుడు తెలుగు లో అధికారికంగా రీమేక్ అవుతుండడం విశేషం.

ఈ సినిమాలో పవన్ మేనల్లుడు సాయితేజ్ పవన్ కి ధీటైన పాత్రలో నటిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ పాత్ర ల మధ్య సన్నివేశాలు ఎంతో బాగా ఉంటాయట.మరి ఇప్పటికే పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ హరిహర వేరమల్లు సినిమా కూడా పూర్తిగా ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ కి తోడు ఎవరు కూడా ఈ సినిమా పై నోరుమెదపకపోవడం ఇప్పుడు ఈ సినిమా లేదనే అందరు అనుకుంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్రీమేక్ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: