నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటి కే బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నారు.


సినిమా మంచి విజయం అందుకోవడంతో బాలకృష్ణ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నా రు. సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంద ట.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపుడి తో సినిమా చేయనున్నార ని తెలుస్తుంది.


ఇకపోతే ఈ సినిమా గురించి తాజా గా ఒక అప్డేట్ విడుదలైంది. అనిల్ రావిపూడి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణతో లేడీ విలన్ పోటీ పడిబోతున్నట్లు సమాచారం.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరో గా నటించిన క్రాక్ సినిమా ద్వారా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో జయమ్మగా ఈమె అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.


 


ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకపాత్ర లో నటించారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ సినిమాలో కూడా ఈమె బాలయ్య తో పోటీ పడబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమా లో కూడా వరలక్ష్మి నటిస్తున్నట్లు సమాచారం.


 


ఇక అనిల్ రావిపూడి ఇప్పటికే బాలకృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నింటిని కూడా పూర్తి చేశారని అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.వచ్చే నెల నుంచి అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: