ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుపోయే సినిమా త్వరలోనే మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పను లన్నిటిని పూర్తిచేసిన కొరటాల శివ ఇప్పుడు నటీనటుల టెక్నీషియన్స్ ఎంపిక చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టులో మొదలుపెట్టే విధంగా ఆయన ప్లాన్ చేశాడు. ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీ వెకేషన్ నుండి తిరిగి వచ్చి ఆగస్టులో కొరటాల శివతో కలిసి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పెరిగిన రేంజ్ నేపథ్యంలో ఎన్టీఆర్ స్థాయికి తగ్గ సినిమా చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం పాన్ ఇండియా నటులను పాన్ ఇండియా టెక్నీషియన్స్ ను ఎంపిక చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. అందుకే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని ఇంకొక వైపు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే ఏడాది తన తదుపరి సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రభాస్ తో చేస్తున్న సలార్ చిత్రం తర్వాత ఈ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు హైప్ పెంచే విధంగా ఎప్పటినుంచే ఆయన ప్రణాళికలు గా చేస్తున్నాడు. కొంతమంది బాలీవుడ్ నటులను ఎంపిక చేస్తూ ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి ప్రశాంత్ ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఈ సినిమా కోసం మరింత మంది పాపులర్ నటులను ఎంపిక చేశారు. ఈ నటుడు యొక్క క్రేజ్ చిత్రానికి తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఅర్ వెట్రిమారన్ దర్శకులతో కూడా సినిమా చేస్తున్నాడని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: