దర్శకుడిగా మారుతి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో హాస్యం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతో అలరిచగా తాజాగా ఆయన చేసిన పక్కా కమర్షియల్ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను ఎంతో ఇబ్బంది పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పోయిన శుక్రవారం విడుదల కాగా ప్రేక్షకులను ఇది భారీగా నిరాశపరిచింది.

దాంతో మారుతి వ్యవహార శైలి మారింది అన్నట్లుగా ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమా సినిమాకు తన స్టామినా ను పెంచుకుంటూ మంచి సినిమాలు చేసే మారుతి చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అని ఆయన పై సెటైర్లు వేస్తున్నారు. తన అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదని తెలుస్తుంది ఆ విధంగా పక్కా కమర్షియల్ సినిమా వీళ్ళిద్దరికీ భారీ ఫ్లాప్ తీసుకురాగా మారుతి ఒకే రకమైన కథలను చేస్తూ ఒకే రకమైన కామెడీని ప్రేక్షకులకు చూపిస్తున్నాడని విమర్శ ఇప్పుడు మొదలైంది.

వాస్తవానికి మారుతి ఇలాంటి విమర్శలను గతంలో కూడా ఎదుర్కొన్నాడు. హీరోకి ఉన్న లోపాన్ని హైలెట్ చేస్తూ దాని చుట్టూ కామెడీ ని అల్లుతూ మారుతి గతంలో సినిమాల ను చేసేవాడు దాని నుంచి బయటకు వచ్చి ప్రతిరోజు పండగే అనే సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న మారుతి మళ్లీ అలాం టి తరహా విమర్శలను ఎదుర్కోవడం నిజం గా దురదృష్టకరం అనే చెప్పాలి. తన గీసుకున్న గీత నుంచి బయటకు రాలేక అక్కడే సినిమాలు చేస్తూ ఫ్లాప్ లు అందుకుంటున్న మారుతీ కి తప్పకుండా మంచి విజయం చేకూర్చాలని అభిమానులు కోరుకుంటున్నా కూడా ఎందుకు ఆయన తన సినిమాలు చేసే వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు చూడాలి. ఆయన తదుప రి సినిమా ను ప్రభాస్ తో చేయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: