టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలను చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయనటువంటి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 25వ తేదీన రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో విశిష్టతను మరెన్నో విశేషాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.

వాస్తవానికి ఈ హీరోకి ఎంత పాజిటివిటీ అయితే ఉందో అంతటి నెగిటివిటీ కూడా ఉంది. కొంతమంది కావాలని ఈ నెగెటివిటీని ఆయనపై స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చిన హీరో ఎదగడం అనేది సహించలేరు కాబట్టి ఈ విధమైన విషపు ప్రచారం ఆయనపై చేస్తున్నారు. అయినా కూడా ఎప్పటికప్పుడు తన స్టామినా ప్రేక్షకులను నిరూపిస్తూనే వస్తున్నాడు . ఆ విధంగా ఇప్పుడు పైన ఇండియా స్థాయిలో తన సినిమా ద్వారా ప్రేక్షకులకు తన యొక్క రేంజ్ ను చూపించవలసిన అవసరం ఏర్పడింది. 

ఇదిలా ఉంటే ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కంటే ముందు పెద్ద హీరో సినిమా లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆ సినిమా విడుదలైన నెలవరకు వేరే పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో అది మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వసూళ్ళ విషయంలో ఇది ఈ సినిమా కి మరింత ప్లస్ అయ్యే విధంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యం లో విజయ్ దేవరకొండటైర్ వన్ హీరో గా ఎదగాలంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సత్త చాతల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఆ వెంటనే మరో సినిమా రిలీజ్ కూడా ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ ఈ సినిమా ను ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది. తొందరలోనే ఈ సినిమా యొక్క భవిష్యత్ తేలబోతుంది. అనన్య పాండే కథానాయిక గా నటిస్తుండగా పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: