విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. విజయ్ దళపతి గత సినిమా బీస్ట్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కాపీ ట్రోల్స్ ను ఎదుర్కొవడం జరుగుతుంది.

సోషల్ మీడియాలో కొంతమంది ఈ సినిమా యొక్క కథ హాలీవుడ్ సినిమాకి కాపీ అని త్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి కొన్ని క్రేజీ సినిమాలకు కాపీ మరకలు రావడం సహజమే. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహూ సినిమాకి అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి, ఆచార్య, పుష్ప వంటి సినిమా లకు ఇలాంటి కాపీ మరకలు వచ్చాయి. అలా ఇప్పుడు ఎన్నో భారీ అంచనాల మధ్య తెరక్కుతున్న ఈ చిత్రం కూడా కాపీ అని కొంతమంది చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా కొంతమంది బాలీవుడ్ నటులను ఈ సినిమాలో నటింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల కాగా దాన్నిబట్టి ఈ సినిమాహాలీవుడ్ సినిమాకి కాపీ అన్నట్లుగా చెబుతున్నారు. గతం లో వంశీ పైడిపల్లి తాను చేసిన ఊపిరి సినిమా హాలీవుడ్ చిత్రానికి ప్రేరణ కాగా దాని వల్లే ఇది కూడ కాపీ అనే వదంతులు వస్తున్నాయి. మరి ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి ఏ విధంగా చేస్తున్నాడో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: