ప్రభాస్ హీరో గా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ముందుగా ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఆయన ఈ సినిమా అందరిని ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఈ చిత్రాన్ని  హిట్ చేయడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. 

ఇంకొకవైపు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాబోయే సినిమా ను, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి చేసి ముందుగా మారుతి సినిమా ను విడుదల చేయాలనీ భావిస్తున్నాడు. సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ప్రభాస్ తీరిక లేకుండా షూటింగ్ లు చేస్తున్నారు. డే అండ్ నైట్ షూటింగ్ లు చేస్తూ బిజీ ఉంటున్న ప్రభాస్ అభిమానులకు టైం ఇవ్వకపోవడం వారికి ఎంతగానో ఇబ్బంది గా ఉంది. 

పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనకు అభిమానులు భారీ స్థాయి లో ఉంటారు. తెలుగు హీరో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అయన అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. గతంలో తెలుగు లో మాత్రమే సినిమాలు చేసేవాడు కాబట్టి ఆయనకు అభిమానులను కలిసేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడంతో రకరకాల ప్రదేశాల్లో ఉండవలసి వస్తుంది కాబట్టి ప్రభాస్ వారికి టైం ఇవ్వలేకపోతున్నాడట. కొంతమంది అభిమానులు ప్రభాస్ ఇంటి దగ్గరికి వెళ్లి ఆయనను కలవాలని చెబుతున్నారుట. వారికి అక్కడి వారు అయన లేరనే సమాధానం చెబుతూ ఉండడం వారిని నిరాశపరుస్తుంది. మరి ప్రభాస్ కొంచెం వారికి టచ్ లోకి వెళ్లి వారికి సమయాన్ని కేటాయిస్తే మంచిది అని కొంతమంది అంటున్నారు. త్వరలోనే ప్రభాస్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఓ ఫాన్స్ మీట్ ను నిర్వహించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: