పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ చిత్ర పరిశ్రమంలో హీరో యిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి వచ్చి ఇక్కడ అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. ఆమె బాలీవుడ్ కెరీర్ కు తెలుగు సినిమా పుష్ప ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి.

 అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా పోయిన ఏడాది డిసెంబర్లో విడుదల కాగా ఆ చిత్రంలో శ్రీవల్లి అనే పాత్రలో మెరిసిన పుష్ప మంచి ప్రశంసలను అందుకుంది. అయితే ఆ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు గాను కొంతమంది బాలీవుడ్ మేకర్స్స్ ఫిదా అయ్యి  ఆమెకు తమ సినిమాలలో అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న యానిమల్ సినిమాలో అవకాశాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా ఛాన్సులు అందుకునేందుకు సిద్ధంగా ఉంది

అదే సమయం లో తెలుగులో కూడా మరికొన్ని క్రేజీ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమవుతుంది. ఆ విధంగా మూడు బాలీవుడ్ సినిమాలు ఆరు సౌత్ సినిమాలు అంటూ రష్మిక మందన కెరియర్ ఎంతో హ్యాపీగా సాగుతుంది. మరి భవిష్యత్తులో ఈమె హాలీవుడ్ లోకి కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడి మేకర్స్ తో ఈమె సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈఈ హీరోయిన్ తక్కువ సమయం లోనే ఈ స్థాయిలో హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పొచ్చు.  బోయపాటి శ్రీను దర్శకత్వం లో రామ్ హీరోగా తెరకెక్కబోయే  సినిమా లో కూడా ఈమె హీరోయిన్ నటించబోతుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: