దుల్కర్ సల్మాన్ తాజాగా సీతా రామం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ సినిమాకు ప్రేమకథ ల స్పెషలిస్టు అయిన హను రాఘవపూడి దర్శకత్వం వహించగా , మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు , ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేలా చేశాయి . తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ లో రష్మీక మందన ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది .  రష్మిక మందన పాత్ర ఈ మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది . సీతా రామం మూవీ కి యుద్ధంతో రాసిన రాసిన ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయం లోకి వెళితే ... సీతా రామం  మూవీ యొక్క నైజాం హక్కులని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథల స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ప్రేమకథ సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: