టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.తాజాగా `సర్కారు వారి పాట`తో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు..ఇక  తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్న సంగతి తెలిసింది.అయితే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయింది.ఇకపోతే మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇమ ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం..

 `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్‌తో ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ జరుగుతోంది. పోతే ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.అయితే  సెకెండ్ హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం.. శ్రీలీల మహేశ్ మూవీకి నో చెప్పిందట.ఇక  దాంతో త్రివిక్రమ్ వెంటనే నిధి అగర్వాల్‌, నభా నటేష్ లను సంప్రదించగా.. వారిద్దరూ కూడా సున్నితంగా రిజెక్ట్ చేశారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అంతేకాకుండా సాధారణంగా మహేశ్ మూవీలో ఛాన్స్‌ అంటే హీరోయిన్స్‌ అంత సులభంగా వదులుకోరు.

ఇదిలావుంటే ముగ్గురు ముద్దుగుమ్మలు మహేశ్ మూవీకి వరసగా నో చెప్పడం వెనక కారణం ఉందని అంటున్నారు.ఇక  అదేంటంటే.. త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా నటించవారు కెరీర్ పరంగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.అయితే  దీంతో త్రివిక్రమ్ మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తే కెరీర్ క్లోజ్ అయినట్లే అన్న బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఇక అందుకే శ్రీలీల, నిధి అగర్వాల్‌, నభా నటేష్ లు మహేశ్ మూవీని వదులుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: