యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా అదిరి పోయే క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత నటించిన సాహో , రాధే శ్యామ్ మూవీ లతో మాత్రం ప్రేక్షకులను అలరించలేక పోయాడు . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు . అందు లో భాగంగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో నటించాడు . ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యింది . ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి . అలాగే ప్రభాస్ ప్రస్తుతం సలార్ , ప్రాజెక్ట్ కే సినిమా లలో నటిస్తున్నాడు . ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా గడుపుతున్న ప్రభాస్ బిజినెస్ రంగం లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది .

ఇప్పటికే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు బిజినెస్ రంగా లలో కి ఎంట్రీ ఇచ్చారు . ఈ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది . మరి కొన్ని రోజుల్లోనే ప్రభాస్ హోటల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది . హోటల్ బిజినెస్ లను కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ప్రారంభిం చాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .  మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: