సీతా రామం: ఇక మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, కన్నడ బ్యూటీ టాలీవుడ్ హాట్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ ఇంకా అలాగే వెన్నెల కిశోర్‌ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించడం జరిగింది.అందాల రాక్షసి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అయిన అశ్వినీదత్‌ నిర్మించారు. తెలుగు, తమిళం, ఇంకా అలాగే మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్‌ రామ్‌ ఇక నాకొక బాధ్యతను అప్పగించాడు. 


ఈ ఉత్తరంని సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం చాలా ఆసక్తిగా సాగింది. రామ్‌ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు హీరోయిన్ రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా పూర్తి కథగా తెలుస్తోంది.ఈ సినిమాలో పాత్రల నటన ఇంకా అలాగే డైలాగ్స్‌ చాలా ఆకట్టుకున్నాయి. ఇక 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. ఇక 1965 వ సంవత్సరం నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్ అందించిన సంగీతం కూడా చాలా బాగా ఆకట్టుుకునేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: