“బాహుబలి 2” వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సలార్, ఆది పురుష్ ఇంకా అలాగే ప్రాజెక్ట్ కే సినిమాలపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.కచ్చితంగా ఈ మూడింటిలో ఒక సినిమా ఆయన ఇండస్ట్రీ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. అయితే పైనున్న మూడింటిలో ముందుగా “ఆది పురుష్” సినిమా రిలీజ్ కానుంది.ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఓం రౌత్ తెలియజేయడం జరిగింది. సరిగ్గా సంక్రాంతి టైములో జనవరి 12వ తారీకున 2023 వ సంవత్సరం అనుకున్న టయానికి “ఆది పురుష్” సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మాట ఇచ్చారు.


ఇక రామాయణం నేపథ్యంలో తేరకెక్కుతున్న “ఆది పురుష్” లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నారు. సీతాదేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇంకా అలాగే రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. త్రీడీలో ఈ సినిమా విడుదల కానుంది.ఇక ఫస్ట్ టైం 3D పిక్చర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో “ఆది పురుష్” సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా “ఆదిపురుష్” ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక అంత మాత్రమే కాదు ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టు “బాహుబలి2” కంటే పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ “ఆదిపురుష్”లో చూడచ్చునట.తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి ఇండియాలో ఇంకా యూ ఎస్ లో శరవేగంగా జరుపుకుంటున్నాయని డైరెక్టర్ ఓం రౌత్ తెలిపాడు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో గుర్తుండి పోయే సినిమాగా నిలిచిపోవడం ఖయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: