సాధారణంగా పెళ్ళి అయిన తరువాత ఒక సంవత్సరం లోపు పండంటి మనవడిని చేతిలో పెట్టాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకు అంటే గర్భం దాల్చడం 9 నెలలు పూర్తి కావడం ఇలా అన్ని జరగటానికి  కనీసం ఒక సంవత్సరం సమయం పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక నటి పెళ్ళైన 5 నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. పెళ్లయిన 4 నెలలకే బిడ్డ పుట్టడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా ఇలా జరగడం వెనుక పెద్ద స్టోరీ ఉంది.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఒక పెళ్ళితో సరిపెట్టుకోవడం లేదు. ముందుగా పెళ్ళి చేసుకోవడం మనస్పర్థలు వచ్చాయి అంటే చాలు నిర్మొహమాటంగా విడాకులు తీసుకొని వేరు పడటం  లాంటి చేస్తున్నారు. ఆ తర్వాత తమకు నచ్చిన వారిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే నటిది ఇలాంటి స్టోరీనే.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మలయాళం తమిళం తెలుగు సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అంజలి నాయర్.


 రజనీకాంత్ హీరోగా వచ్చిన అన్నాత్తే సినిమాలో రజినీకి తల్లి పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అంజలి రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఒక ఫోటో కూడా షేర్ చేసింది. అయితే పెళ్లికి ముందు ఈ అమ్మడు మలయాళీ ఫిలిం మేకర్ అనీష్ ను వివాహం చేసుకుంది. ఎక్కువ కాలం వీరు కలిసి ఉండలేదు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజు తో ప్రేమలో పడి కొన్నాళ్ళు సహజీవనం చేశారు. ఇటీవలే అతని రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు వీరి సహజీవనం కారణంగా  ఇక పెళ్లి అయిన 5 నెలలకు చివరికి వీరికి బిడ్డ పుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: