నందమూరి కళ్యాణ్ రామ్  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా  హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'బింబిసార' . ఇకపోతే ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తాజా సమాచారం ప్రకారం  తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుననాడు కళ్యాణ్ రామ్, అయితే ఇక ఇప్పుడు బింబిసార సినిమాతో రాబోతున్నాడు.అయితే  యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్  తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో క్యాథరీన్ థ్రెసా , సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్ హీరోయిన్స్‌గా నటించారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలావుంటే ఆగష్టు 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే.ఇకపోతే   ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ఇక ఈ నెల 29న గ్రాండ్‌గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.ఇకపోతే  ఈ గ్రాండ్ ఈవెంట్‌కి నందమూరి కళ్యాణ్ రామ్ సోదరుడు పాన్ ఇండియన్ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను వదిలారు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

అయితే ఇదిలా ఉంటే, ఇక  తాజా సమాచారం మేరకు బింబిసార సినిమా రన్ టైం ని మేకర్స్ లాక్ చేయడం జరిగిందట. కాగా మొత్తం రన్ టైం 2గంటల 26 నిముషాలకు ఫైనల్ చేశారట చిత్ర బృందం.అయితే  సెన్సార్ పూర్తైన తర్వాత ఈ విషయంలో కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం వినబడుతోంది.ఇకపోతే ఎన్టీఆర్ ఆర్ట్స్  పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కాగా త్రిగర్తల రాజ్య ప్రభువు అయిన బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అయితే చిరంతన్ భట్ మ్యూజిక్, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: