టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రచయితగా తెలుగు సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ దర్శకుడు ఇప్పడు అగ్ర డైరెక్టర్ గా ఎదిగి పెద్ద హీరోలతో సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో మూడవ సినిమాను చేస్తున్న త్రివిక్రమ్ అంతకుముందు ఇండస్ట్రీ హిట్టుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఆయన తన సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న సమయంలోనే ఇతర సినిమాలకు రచయితగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా కోసం ఆయన దర్శకుడిగా కాకుండా రచయితగా వ్యవహరించడం విశేషం. ఓ అగ్ర దర్శకుడు ఇతర సినిమాకు రచయితగా వ్యవహరించడం అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా త్రివిక్రమ్ ఆ సినిమాకు రచయితగా వహించడం విశేషం. ఇప్పుడు కూడా మరొక సినిమాకు ఆయన రచయితగా వ్యవహరిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇకపోతే కొంతమంది దర్శకులు సినిమాలను చేస్తున్న సమయంలో యాడ్స్ కి కూడా దర్శకత్వం వహిస్తూ ఉంటారు. అయితే యాడ్స్ కి పేర్లు ఉండవు కాబట్టి ఎవరు ఏ యాడ్ చేశారో ఎవరికి తెలియదు. అలా ఇప్పుడున్న చాలామంది టాలీవుడ్ అగ్ర దర్శకులు గతంలో చాలా యాడ్స్ చేసి డబ్బు సంపాదించారు. తాజాగా ఓ యాడ్ ను త్రివిక్రమ్ డైరెక్ట చేశాడని చెబుతున్నారు. దానికోసం ఆయన 40 లక్షలు పుచ్చుకున్నాడట. ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి గల కారణం త్రివిక్రమ్ బ్రాండ్ అనే తెలుస్తుంది. ఈ యాడ్లో కేవలం యాక్షన్ కట్ అని చెప్పడం మాత్రమే త్రివిక్రమ్ చేశాడట. మిగతాదంతా కూడా క్రియేటివిటీ టీమ్ చూసుకుందట. ఈ మాత్రం దానికే ఆయనకు 40 లక్షలు ఇవ్వడం అవసరమా అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ కు యాడ్స్ లో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఉందని దీన్ని బట్టి చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: