కమలహాసన్ కూతురు శృతిహాసన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోయిన్ లలో ఒకరు. ఆమెతో కలిసిన నటించాలని ప్రతి ఒక్క హీరో కూడా కలలు కంటూ ఉంటాడు. ఆ విధంగా మొదట్లో కొన్ని ఆటు పోట్లు ఎదురైనా కూడా శృతిహాసన్ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపిక అయింది.

అంతే కాదు చిరు సరసన కూడా ఆమె హీరోయిన్ హా నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ జరగనుంది.  బాబీ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నాడు.  ఈమె హీరోయిన్ గా నటిస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ విధంగా రెండు పెద్ద హీరోల సినిమాలలో ఈమె అవకాశాలు దక్కించుకోనుంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విధంగా మూడు భారీ ప్రాజెక్టులలో ఆమె హీరోయిన్ గా చేస్తూ గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంది.

అయితే వీరందరూ కూడా 50 ఏళ్లకు పైబడిన హీరోలే కావడం శృతిహాసన్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. ఆమె సీనియర్ హీరోలతో నటించడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. చాలామంది యువ హీరోలు ఉన్నా కూడా శృతిహాసన్ ఎందుకు ఇలాంటి సినిమాలను ఒప్పుకుంటుందని వారు చెబుతున్నారు. వాస్తవానికి సౌత్ సినిమా పరిశ్రమంలో భారీ స్థాయిలో క్రేజీ ఉన్న ఈ హీరోయిన్ యువ హీరోల సరసన నటిస్తే చాలా బాగుండేది అలా కాకుండా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లాగా తన నాన్న వయసు ఉన్న హీరోలతో కలిసి నటించడం వంటివి జరగడం శృతిహాసన్ యొక్క క్రేజ్ తగ్గిపోవడానికి కారణం అవుతుంది. మరి భవిష్యత్తులో అయినా ఆమె చేసే సినిమాలు తన వయసుకు తగ్గ హీరోలు చేస్తే బాగుంటుంది అనేది ఆమె అభిమానుల ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: