రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత నుండి వరుస పెట్టి భారీ బడ్జెట్ మూవీ లలో నటిస్తున్నాడు . ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఉన్నప్పటికీ ఎప్పుడో 2017 లో బాహుబలి సినిమా విడుదల అయినప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం సహో ,రాధే శ్యామ్ మూవీ లను మాత్రమే విడుదల చేయగలిగాడు .

ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్బ స్టర్ విజయాలను అందుకోలేక పోయాయి . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ 'ఆది పురుష్' సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం సలార్ మరియు ప్రాజెక్ట్ కే  సినిమా షూటింగ్ లెస్లో పాల్గొంటున్నాడు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆది పురుష్ సినిమాని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది . అలాగే సలార్ మూవీ ని కూడా 2023 ఏప్రిల్ నెలలో దాదాపుగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా ప్రాజెక్ట్ కే నిర్మాత అయిన అశ్వినీదత్ 'ప్రాజెక్ట్ కే'  సినిమా విడుదల తేదీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు .

ప్రాజెక్ట్ కే మూవీ ని 18 అక్టోబర్ 2023 న లేదా  2024 జనవరి లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . దీనితో చూసుకుంటే 2023 జనవరి నుండి , 2024 జనవరి వరకు ప్రభాస్ ఒకే సంవత్సరం మూడు సినిమాలతో తన అభిమానులను అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: