టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తన కంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్న అనిల్ సుంకర గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిర్మాత అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  భోళా శంకర్ మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

మూవీ తో పాటు అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఏజెంట్ ని కూడా ఈ నిర్మాత తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత అనిల్ సుంకర ప్రస్తుతం నేను నిర్మిస్తున్న రెండు సినిమాల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను అని , భోళా శంకర్ మూవీ ని మెహర్ రమేష్ , ఏజెంట్ మూవీ ని సురేందర్ రెడ్డి  చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ మల్టీస్టారర్ మూవీ కాంబినేషన్స్ అంటే ఎంతో ఇష్టం అని అన్నారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ మరియు చిరంజీవి, అలానే పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్స్ లో మల్టీస్టారర్ మూవీస్ వస్తే సూపర్ గా ఉంటుందని, అలానే ఆ మల్టీ స్టారర్ మూవీస్ లో సూపర్ స్టార్ మహేష్ సర్ప్రైజింగ్ గా ఒక క్యామియో రోల్ చేస్తే మరింత అద్భుతంగా ఉంటుందని నిర్మాత అనిల్ సుంకర తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఏజెంట్ మూవీ ఆగస్టు 12 వ తేదీన విడుదల కానుండగా, భోళా శంకర్ మూవీ విడుదల తేదీ ని మూవీ యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: