టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తెరకెక్కుతున్న మరో సినిమా కోసం ఫ్యాన్స్ కూడా కళ్లు కాయలు కాచేలా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా తెగ ఫీలవుతున్నారు. ఈ సినిమా నిర్మాతలలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తారని ఫ్యాన్స్ భావించారు.అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావడానికి చాలా సమయం ఉందని సరైన సమయం వస్తే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుండగా కళ్యాణ్ రామ్ మాటలు వాళ్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తుండటం గమనార్హం. అనిరుధ్ రవి చందర్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది.


ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో కళ్యాణ్ రామ్ కు సైతం అసలు క్లారిటీ లేదని ఆ కారణం వల్లే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పలేకపోతున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంకా అలాగే మరోవైపు తారక్ సోషల్ మీడియా ద్వారా అయినా ఈ సినిమాకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కొరటాల శివ వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అనేది వినిపిస్తోంది.కొరటాల శివ ఆచార్య సినిమా వల్ల చాలా ఇబ్బందుల్లో పడగా ఆర్థిక సమస్యల వల్ల కొరటాల శివ స్క్రిప్ట్ పనులను ఆలస్యం చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఆచార్య సినిమా వల్ల కొరటాల శివకు రెమ్యునరేషన్ అనేది దక్కకపోగా ఇంకా ఆయన రివర్స్ లో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: