టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలలో హీరోగా ఉంటూనే మరొకపక్క వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.. ఏషియన్ సమస్త తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ ను స్టార్ట్ చేశారు. GMB అనే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మేజర్ వంటి చిన్న సినిమాలను నిర్మిస్తూ అలాగే తన సినిమాలకు సహానిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు మహేష్. ఇక వీటితోపాటు పలు కమర్షియల్ యాడ్ లలో కూడా నటిస్తూ ఉన్నారు మహేష్ బాబు. ఇక ఇప్పుడు తాజాగా ఒక పెద్ద రెస్టారెంట్ ను కూడా హైదరాబాదులో స్టార్ట్ చేయబోతున్నారు.



మినర్వా వారితో కలిసి ఒక గ్రాండ్ లగ్జరీ రెస్టారెంట్ ను మొదలుపెట్టబోతున్నట్లు మహేష్ బాబు సమాచారం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఎక్కువగా వ్యాపార రంగంలో రాణిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇలాంటి వాటిలో మహేష్ బాబు కూడా అడుగుపెట్టబోతున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యామిలీ నుండి కేవలం మహేష్ బాబు ఒక్కడే పలు వ్యాపారాలను రాణిస్తూ ఉన్నారు మిగిలిన స్టార్ హీరోలు ఫ్యామిలీలు ఎవరో ఒకరు కూడా పలు వ్యాపారాలలో రాణిస్తున్నారు.

 ఇక ఈ సంవత్సరం సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు..ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం మా మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం కొత్త బిజినెస్ వైపు కూడా అడుగులు వేయడంతో మహేష్ అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: