అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజీ హీరోయిన్ గా సంపాదించుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఓకేనా చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత సినిమాల ఆఫర్లను దక్కించుకుంది. అయితే శ్యామ్ సింగరాయ్, బంగారు రాజు వారియర్ వంటి సినిమాలలో నటించింది తాజాగా హీరో నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతున్నది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసింది.


ఇందులో భాగంగానే కృతి శెట్టి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేసింది తనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మనసు బాగా లేనప్పుడు తను ఐస్ క్రీమ్ తెగ తింటానని తెలియజేసింది. ఐస్ క్రీమ్ తింటే తన మూడు ఇట్టే మారిపోతుంది అని సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది సహజంగానే ఒత్తిడిలో ఉంటే ఎవరైనా సరే చాక్లెట్లు ఎక్కువగా తింటూ ఉంటారు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఐస్ క్రీమ్ తింటానని తెలియజేసింది.


ఇదంతా ఇలా ఉండగా కృతి శెట్టి ప్రస్తుతం ఇంద్రగంటి డైరెక్షన్లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఒక వీటితోపాటు నాగచైతన్యతో మరొక సినిమాలు నటించేందుకు సిద్ధమయ్యింది. ఇక తమిళంలో కూడా ఒక సినిమాల నటించబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా నటించిన..ది వారియర్ చిత్రం మాత్రం ఈమెకు అనుకున్నంత స్థాయిలో విజయం రాలేదు.. దీంతో ఈమె పైన పలు విమర్శలు కూడా వెలుపడడం జరిగింది. మరి తన తదుపరిచిత్రమైన విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: