మెగాస్టార్
చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్న చిత్ర బృందం తొందర్లోనే దానిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రంలో
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం.
అయితే ఈ సినిమాలో మరొక
హీరో కూడా నటించడం
సినిమా పట్ల అందరిలో ఎంతో ఆసక్తి పెరగడానికి కారణం అయ్యింది.
మాస్ రాజా
రవితేజ ఈ చిత్రంలో
మెగాస్టార్ తో కలిసి నటిస్తూ ఉండడం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. మొదటి నుంచి ఈ
సినిమా పూర్తిగా
మెగాస్టార్ నటించిన చిత్రం అనే అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో
రవితేజ కూడా చేరడం ఒక్కసారిగా అందరిని ఆసక్తి పరిచింది.
సినిమా పట్ల ఎన్నో అంచనాలను కూడా పెంచింది. కారణమేదైన కూడా మెగా అభిమానులకు
మాస్ రాజా అభిమానులకు ఇది ఎంతో ముఖ్యమైన
సినిమా అయిపోయింది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో
రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని
చిరంజీవి దొంగగా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య జరిగే డ్రామా నే ఈ
సినిమా యొక్క కథ అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ
సినిమా కథ వింటుంటేనే అందరికీ ఈ లైన్ వింటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే తప్పకుండా
సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే విధంగా
చిరంజీవి ప్రణాళికలు రచించారు. ప్రస్తుతానికి
గాడ్ ఫాదర్ సినిమాతో బిజీగా ఉన్న ఆయన ఆ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నారు. ఆ తరువాత
సంక్రాంతి కానుక భోళా
శంకర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.