త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ చిత్రం ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ఎప్పుడో మొదలైన కూడా ఇంకా షూటింగ్ మొదలు పెట్టకపోవడం పట్ల అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. కానీ ఇటీవలే ఈ సినిమాను ఆగస్టు నెల నుంచి మొదలు పెట్టబోతున్నామని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించడం అందరిలో ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చింది.

 ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా భావించారు కానీ అప్పుడు ఇతర సినిమాలు విడుదల కాబోతూ ఉండడంతో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఆ విధంగా త్రివిక్రమ్సినిమా కోసం ఎన్నో స్పెషల్స్ యాడ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రను కూడా సృష్టించి దాని ద్వారా సినిమాకు గ్లామర్ ఇంప్రెషన్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట త్రివిక్రమ్. 

 దాని కోసం పెళ్లి సందడి ఫేమ్ శ్రిలీల ను హీరోయిన్ గా మొదటగా అనుకున్నారు కానీ ఆ తర్వాత ఈ పాత్ర కోసం పలువురిని ఎంపిక చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక మోహనన్, సంయుక్త మీనన్ పేర్లను కూడా త్రివిక్రమ్ పరిశీలిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రధాన కూడా రాబోతుంది. మరి ఈ సినిమాలో నటించబోయే రెండవ హీరోయిన్ పాత్ర ఏ ముద్దుగుమ్మకు దక్కుతుందో చూడాలి. కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా ఈ పాత్రలో ఎంతో విశిష్టత కూడా ఉందట. అందుకే త్రివిక్రమ్ దీని కోసం ఎంత సమయాన్ని తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులను పరిశీలిస్తున్నాడట త్రివిక్రమ్. మాటల మాంత్రికుడుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గొప్ప పేరు కలిగి ఉన్న త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారా మరొకసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించన్నాడు. అంతకుముందు ఆయన రూపొందించిన అల వైకుంఠపురంలో సినిమా భారీ స్థాయిలో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: