విజయ్
దేవరకొండ హీరోగా నటించిన లైగర్
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. స్వయంగా
విజయ్ దేవరకొండ ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని చిత్రంపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. ఆయనకు తోడు
అనన్య పాండే కూడా ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించగా
సినిమా కి
బాలీవుడ్ లో మంచి
మార్కెట్ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను తప్పకుండా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇందులో
మైక్ టైసన్ కూడా ఓ పాత్రలో నటించడం విశేషం. ఇన్ని విశేషాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఏ
హీరో అయినా తన సినిమాకు ప్రమోషన్స్ చేస్తాడు కానీ
విజయ్ దేవరకొండ స్థాయిలో ఏ
హీరో కూడా ప్రమోషన్ చేయడనే చెప్పాలి. తన సినిమాను ముందుండి నడిపించడమే
విజయ్ దేవరకొండ యొక్క స్పెషాలిటీ.
మరి ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా యొక్క ప్రీ రిలీజ్
ఈవెంట్ ను త్వరలోనే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లలో చిత్ర బృందం ఉంది. మరి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ
సినిమా విడుదల తర్వాత ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ
సినిమా తప్పకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చెబుతున్నారు. ఇక వీరి కలయికలో లైగర్
సినిమా తరువాత జనగణమన అనే మరొక
సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది ఆగస్టు మూడవ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరి లైగర్
సినిమా విడుదల తర్వాత ఎప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలుపెడతారో చూడాలి.