అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా అలరించబోతుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పై అక్కినేని అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అక్కినేని అఖిల్ కెరియర్ మొదటి నుంచి కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే వస్తున్నాడు.

ఆయన హీరోగా నటించిన తొలి మూడు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. నాలుగవ సినిమా మోస్తరుగా ప్రేక్షకులను అలరించింది. అయితే అక్కినేని అభిమానుల ఆకలి మాత్రం పూర్తిస్థాయిలో తీరలేదని చెప్పాలి. అందుకే ఈసారి చేయబోయే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే సురేందర్ రెడ్డి లాంటి భారీ యాక్షన్ స్టైలిష్ దర్శకుడు తో కలిసి ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. 

ఇటీవల ఈ సినిమా యొక్క టీజర్ విడుదల కాక అది ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది. అఖిల్ ను వేరే లెవెల్ లో చూపించిన ఈ టీజర్ తప్పకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచిందని చెప్పవచ్చు. కానీ అక్కినేని అఖిల్ లో మాత్రం ఈ సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించడం లేదు కారణమేదైనా కూడా అఖిల్సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడం ఈ చిత్రం ఏ విధమైన ఫలితాన్ని అందుకుంటుందో అన్న అనుమానాలు కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మధ్యలో ఈ సినిమా ఆర్థిక కారణాలవల్ల ఆగిపోయింది అనే వార్తలు రావడం ఈ చిత్రం పట్ల కొంత నెగిటివిటీ ఏర్పడడానికి కారణం అయ్యింది. సోషల్ మీడియాలో దీన్ని బేస్ చేసుకుని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 మరి వీరందరి నోళ్లు ముగించాలంటే ఈ చిత్రం విడుదల అయ్యే మంచి సక్సెస్ సాధించవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నాడు.తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను డిసెంబర్  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: