టాలీవుడ్ లో హిట్స్ ప్లాప్స్ తో అసలు సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో గోపీచంద్. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాప్ సినిమాలు ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు.చివరి సారి సీటిమార్ సినిమాతో పరవాలేదనిపించిన గోపీచంద్.. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. కామెడీ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలైతే క్రియేట్ చేసింది. కానీ.. ఈ సినిమా కూడా ఆ అంచనాలను అందుకోలేక ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. .ఇక ఇప్పుడు పక్కా కమర్షియల్ మూవీ కూడా ఓటిటి విడుదలకు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటిటి సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ పక్కా కమర్షియల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆగష్టు 5 వ తేదీ నుండి రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. అయితే.. ఈ పక్కా కమర్షియల్ మూవీ థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటిటిలోకి వస్తుండటం విశేషం.


రాశీఖన్నా హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను యూవీ క్రయేషన్స్‌ ఇంకా జీఎ2 పిక్చర్స్ బ్యానర్స్ పై బన్నివాస్‌, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. పెద్ద రొట్ట సినిమాగా ప్రేక్షకులను బోర్ కొట్టించిన ఈ సినిమా ఓటిటి ద్వారా అయిన అల్లరిస్తుందేమో చూడాలి.ఇక ఇదిలా ఉండగా.. గోపించంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి సూపర్ హిట్స్ సినిమాలు వచ్చాయి. ఇక 'పక్కాకమర్షియల్' సినిమా తో ఆకట్టుకోలేకపోయిన డైరెక్టర్ మారుతి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కోసం హారర్ కామెడీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. ఫ్యాన్స్ వద్దు బాబోయ్ అన్న ప్రభాస్ ఆ మహానుభావుడు సినిమాని కంఫార్మ్ చేశాడు. మరి దాన్ని ఎలా తీస్తాడో మహానుభావుడు మారుతీ.

మరింత సమాచారం తెలుసుకోండి: