టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. అయితే రెండేళ్ల క్రితం వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క ప్రస్తుతం సినిమాల విషయంలో వేగం తగ్గించారు.ఇకపోతే నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా అనుష్క యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.ఇదిలావుంటే అనుష్క ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా అనుష్క మాత్రం కేవం 23 మందిని మాత్రమే ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

ఇక అనుష్క ఫాలో అవుతున్న వాళ్లలో తెలుగు హీరోలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ హీరోలలో ఒక ప్రభాస్ కాగా మరొకరు రానా కావడం గమనార్హం.పోతే  ప్రభాస్ అనుష్క కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు తెరకెక్కాయి.అయితే  బాహుబలి సిరీస్ షూటింగ్ సమయంలోనే రానా అనుష్కలకు పరిచయం ఏర్పడింది.ఇకపోతే తక్కువ మంది హీరోలే ఈ జాబితాలో ఉన్నా హీరోయిన్లు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.కాగా  దర్శకధీరుడు రాజమౌళిని కూడా ఈ స్టార్ హీరోయిన్ ఫాలో అవుతున్నారు. ఇక జక్కన్న అనుష్క కాంబోలో విక్రమార్కుడు, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు తెరకెక్కాయి.

ఇదిలావుంటే మరోవైపు అనుష్క వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాగా అనుష్క ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.పోతే  సినిమాసినిమాకు అనుష్క రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అనుష్క లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకొని రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: