టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
మాస్ చిత్రాలను
మాస్ ప్రేక్షకులకు తగ్గట్లుగా చేసి వారిని అలరించే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. ఆ విధంగా దర్శకుడు
బాబీ తన మొదటి
సినిమా నుంచి
మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఏ విధంగా
హీరో ఎలివేషన్ చేయాలి ఏ విధమైన సీన్ బాగా రక్తి కట్టించాలి అనే విషయం పక్కాగా తెలిసిన బాబి ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవితో
సినిమా చేయడం విశేషం. ఇంత తక్కువ అనుభవంతో
మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోను దర్శకత్వం చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.
రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యి
మాస్ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాడు బాబి. ఆ
సినిమా అంతగా
సక్సెస్ కాకపోయినా కూడా పవన్ మళ్లీ ఆయనకు అవకాశం ఇచ్చాడు. పవన్
కళ్యాణ్ పిలిచి మరి ఆయనకు ఓ అవకాశం ఇచ్చాడు. అయితే ఆ చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అయినా పెద్ద
హీరో అయిన
ఎన్టీఆర్ పిలిచి మరి ఈ దర్శకుడికి అవకాశం ఇవ్వగా దానిని హిట్ చేసి నమ్మకాన్ని నిలుపుకున్నాడు.
ఆ విధంగా మంచి సక్సెస్ను అందుకున్న
బాబీ అప్పుడే
చిరంజీవి దృష్టిలో పడ్డాడు. ఆ విధంగానే ఒక కథను ఆయనకు నెరే ల్ చేయగా దానికి ఎంతగానో
ఫిదా అయిపోయిన
మెగాస్టార్ చిరంజీవి ఆయనతో మళ్లీ
సినిమా చేయాలని భావించాడు. త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను దీనికి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మరి ఇన్ని అంచనాల మధ్య రూపొందుతున్న ఈ
సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని, అభిమానుల కోరిక మేరకు వారు అనుకున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకుంటానని తప్పకుండా
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద విజయాన్ని తెచ్చి పెడతానని చెబుతున్నాడు. మరి ఈ మాటలన్నిటిని
బాబీ నిలబెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తీసుకువస్తాడా అనేది చూడాలి. దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిని విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.