ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుపుకుంటుంది. కే జి ఎఫ్
సినిమా తర్వాత
ప్రశాంత్ నీల్ తెరకెత్తిస్తు న్న ఈ
సినిమా తప్పకుండా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది అన్న నమ్మకాలను వ్యక్తపరుస్తున్నారు. వాస్తవానికి ఈ
సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాలు వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు
ప్రభాస్ అభిమానులు.
ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడడంతో ఈ సినిమాపై వారు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
ఆది పురుష్ ఏ విధంగా కూడా కమర్షియల్
సినిమా కాకపోవడంతో భారీ కమర్షియల్ అంశాలు కలిగిన చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఈ చిత్రం సంచలన విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాలో మంచి మంచి ట్విస్ట్ లు ఉన్నాయని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే
ప్రభాస్ అభిమానులు ట్విస్ట్ ల సంగతి పక్కన పెట్టి
హీరో ఎలివేషన్ బాగుండాలని కథ ఇంకా బాగుండాలని అప్పుడే
ప్రభాస్ ను వెం టాడుతున్న ఫ్లాప్ సమస్య దూరమవుతుంది అని వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా
ప్రభాస్ విజయం అందుకోవాలని ఆయన అభిమానులు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా ఈ
సినిమా ద్వారా భారీ విజయం అందుకోవాలని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇకపోతే ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే
సినిమా చేస్తున్నాడు. అలా ఇన్ని భారీ ప్రాజెక్ట్ లతో
సినిమా చేస్తున్న
ప్రభాస్ త్వరలోనే ఓ
సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరి అయన అభిమానులు కోరుకుంటున్న విజయం దక్కుతుందా అనేది చూడాలి.