అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , దునియా విజయ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించనుండగా, ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ని మూవీ యూనిట్ ఫిక్స్ చేయలేదు.
ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో 107 వ సినిమా గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణ ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి కూడా తమన్ సంగీతం అందించబోతున్నడు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత బాలకృష్ణ లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో బింబిసార మూవీ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన మల్లాడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.