పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ గత కొంతకాలంగా బొత్తిగా నల్ల పూస అయిపోయాడు.అయితే  ఇటీవలే సీతారామం ఈవెంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక అతడి రూపం పూర్తిగా మారిపోయింది.ఇకపోతే మునుపటితో పోలిస్తే ఇప్పుడు కాస్త స్మార్ట్ లుక్ కి షిఫ్టయ్యాడు. ఇదిలా వుండగా ఓవైపు ఆదిపురుష్ 3డి రిలీజ్ కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్న ప్రభాస్ సలార్ ని కూడా శరవేగంగా ముగించేస్తున్నాడు.ఇక  ఇంతలోనే ఈ గ్యాప్ లో ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు.అయితే మొన్నటికి మొన్న సీతారామం (దుల్కార్ సల్మాన్) ఈవెంట్లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇకపోతే  వేదికపై తన ప్రాజెక్ట్ కే నిర్మాతలు స్వప్పాదత్ - అశ్వనిదత్ లను విపరీతంగా ప్రశంసించాడు.అంతేకాదు  తన నిర్మాతల్లో స్వప్నాదత్ ది బెస్ట్ అని కూడా అశ్వనిదత్ ముందు కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. అయితే సీతారామం చిత్రానికి ప్రభాస్ ప్రచారం పాన్ ఇండియా కేటగిరీలో అదనపు బూస్ట్ ని ఇచ్చిందనడంలో సందేహం లేదు.ఇక ఇంతలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు సలార్ నుండి సంథింగ్ స్పెషల్ ఉంటుందని ప్రకటించగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. పోతే ఇంతలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో కనిపించాయి.

ఇక అవి క్షణంలో వైరల్ గా మారాయి.అయితే నిన్నటి మధ్యాహ్నం హైదరాబాద్ ఆవాసా హోటల్ లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ కు ప్రభాస్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో ప్రభాస్ బ్లాక్ షర్ట్ ధరించి కనిపించాడు.ఇకపోతే అతడు స్టైలిష్ గా ఉబెర్ కూల్ లుక్ తో కనిపించాడు. కాగా ప్రభాస్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నా.. తన రూపం బయటపడకుండా ఏదో దాస్తున్నట్టే కనిపించాడు. అతడు క్యాప్ పెట్టుకుని ఉండడంతో పూర్తిగా హెయిర్ స్టైల్ రివీల్ కాలేదు.అంతేకాదు  సన్నగా గడ్డం పెరిగి ఉంది.ఇకపోతే అంతగా మ్యాచో మాన్ లా కాకుండా స్లిమ్ గానే కనిపించడం ఆశ్చర్యపరిచింది. ఇక సలార్ నుంచి రానున్న గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: