యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు  . ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న , మధ్యలో ప్రభాస్ ఇతర మూవీ షూటింగ్ లలో పాల్గొనడం , అలాగే ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పనుల్లో కొంత కాలం బిజీగా ఉండటం వల్ల సలార్ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా జరిగింది . కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కే జి ఎఫ్' మూవీ ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే . కే జి ఎఫ్ మూవీ రెండు భాగాలు కూడా అద్భుతమైన విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాయి. కే జి ఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: