ఇటీవల ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈ మూవీతో నార్త్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో అయ్యారు తారక్.ఇకపోతే కొమురం భీమ్ పాత్రలో భారతీయ సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. కాగా తారక్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఇక త్వరలోనే తన తదుపరి చిత్రం షూటింగ్‏లో భాగం కానున్నారు.కాగా  మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నెక్ట్స్ మూవీ రానుంది.

 అయితే ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే  ఈ సినిమానే కాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనూ తారక్సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.ఇకపోతే  తాజాగా ntr 31 చిత్రం గురించి డైరెక్ట్రర్ ప్రశాంత్ నీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇకపోతే తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ప్రశాంత్ నీల్.. తారక్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమా షూటింగ్ ఏప్రిల్, మే నెలలో ప్రారంభం కానుందని తెలిపాడు.

 ఇక దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పోతే ఇందులో శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని  గ్యాంగ్ స్టార్ గా చూడబోతున్నాం...అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.ఇదిలావుంటే ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేసి ఎన్టీఆర్ తో సినిమా పట్టాలెక్కించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: