రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు . బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ మూవీ లో కృతి సనన్ కథానాయిక పాత్ర లో కనిపించనుండగా , బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ లో ప్రభాస్ ... రాముడి పాత్రలో కనిపించనుండగా , కృతి సనన్ ... సీత పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ... రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఆది పురుష్ మూవీ కి భారతదేశ వ్యాప్తంగా ఏ రేంజి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కి 210 కోట్ల బారి ఆఫర్ వచ్చినట్లు , దానితో ఆది పురుష సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను మూవీ యూనిట్ అమ్మేసిన టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఆది పురుష్ మూవీ కి నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: