బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య పాండే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి హిందీ సినీ పరిశ్రమ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకుంది. హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ మరి కొద్ది రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ హీరోగా , టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  లైగర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ సినిమాను ఈ నెల అనగా ఆగస్ట్ 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు  ఈ మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు వరుస పెట్టి దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా లైగర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని తనకు ఎప్పటి నుండో ఉందని , లైగర్ మూవీ తో ఆ కోరిక నెరవేరుతుంది  ముద్దు గుమ్మ అనన్య పాండే చెప్పు కొచ్చింది. అలాగే తెలుగు ప్రేక్షకులు అంటే తనకు ఎంతో ఇష్టమని అనన్య పాండే పేర్కొంది.  ఆగస్ట్ 25 వ తేదీన బాక్సా ఫీస్ పగిలి పోద్ది , పక్కా మాస్ కమర్షియల్ మూవీ ని దింపుతున్నాం అంటూ అనన్య పాండే చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: