టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ లలో కార్తికేయ సినిమా కూడా ఒకటి. ఈ మూవీ లో లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అప్పట్లో కార్తికేయ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా , అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడంతో తాజాగా నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 మూవీ ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించాడు.

సినిమా ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ ...  కార్తికేయ 2 మూవీ కి ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. మేము మూడు సంవత్సరాలు పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేశారు. విడుదల అయిన ప్రతి చోటు నుండి ఈ మూవీ కి సూపర్ హిట్ టాక్ లభించింది. యూ ఎస్ నుంచి వస్తున్న స్పందన కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ నిఖిల్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: