ఇక అంతకుముందు ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి.. జెండా వందనం అనంతరం ప్రసంగించారు. ఇక 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని.. ఈ ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టం అని భావిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. ఇక వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. అక్కడ ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న తన అభిమానిని స్వయంగా కలిశారు. అతనితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు . ఇక చిరంజీవిని చూసేసరికి అతడి ఆనందం రెట్టింపు అయిందని చెప్పాలి.
ఇక అభిమాని చక్రీధర్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు.. చక్రిధర్ పెడన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇక చిరంజీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పల్చల్ చేస్తూ ఉంది.. అంతేకాదు మెగాస్టార్ మంచి మనసుపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా తన బిజీ లైఫ్ లో కూడా అభిమానులకు సమయాన్ని కేటాయిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం గొప్ప విషయం అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.