పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నడు. అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ వరస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే అజ్ఞాతవాసి మూవీ తర్వాత వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ మూవీ లలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బడ్జెట్ కు సంబంధించి నా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: