స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, కుమార్, ప్రవీణ్, సన, జబర్దస్త్ అప్పారావు త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో కళాపురం అనే ఒక మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి కరుణకుమార్ దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్రం బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. 

అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ ఈ సినిమా 26 ఆగస్టు 2022 వ తేదీన విడుదల అయ్యింది.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్ లు కూడా రాలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన కళాపురం మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లలో ఒకటి అయినటువంటి జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  కళాపురం సినిమా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జీ 5 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: